సూర్యాపేట జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి చుట్టూ సప్త వర్ణాలతో వలయం ఏర్పడింది.సూర్యుడు సప్త వర్ణాలతో మెరిసిపోయాడు. ఈ దృశ్యం చూపరులను సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తింది.
ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడుతుంటాయి.