31.2 C
Hyderabad
May 2, 2024 23: 36 PM
Slider ప్రత్యేకం

తెలుగు రాష్ట్రాలో పలుచోట్ల NIA సోదాలు

#NIA

దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎడతెరిపిలేని సోదాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో ఏకకాలంలో 23 బృందాలతో NIA నేడు సోదాలు నిర్వహిస్తున్నది.

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని ఖాజా నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. NIA అధికారులను బుచ్చిరెడ్డిపాలెంలోని ఓవర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడ ఇలియాజ్ అనే వ్యక్తి తో పాటు అతని మిత్రుల ఇళ్లలో కూడా NIA సోదాలు నిర్వస్తున్నది.

ఇలియాజ్ కు ఉగ్ర మూలాలు ఉన్నాయనే సమాచారం తో NIA రంగంలో దిగింది. అంతే కాకుండా PFI జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మోబిన్  లను ఇప్పటికే  అరెస్ట్ చేసి వీరిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్ నెస్ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో PFI కార్యకలాపాలు జరుగుతున్నాయని NIA కు సమాచారం ఉంది.

ఇదంతా మతకలహాలు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రగా వారు భావిస్తున్నారు. చురుకైన అతివాదులకు, మతోన్మాదులకు ఈ శిబిరాలలో ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నట్లు NIA గుర్తించింది.

Related posts

కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

త్వరలో కామన్ మొబిలిటీ కార్డు

Satyam NEWS

స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న భర్త

Satyam NEWS

Leave a Comment