వనపర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు వనపర్తి అవినీతి, అక్రమాలపై ప్రశ్నించలేదని వైయస్సార్ తెలంగాణ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ న్యాయవాది బూజల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం కార్యాలయాన్ని కో ఆర్డినేటర్ బూజల వెంకటేశ్వర్ రెడ్డి
ప్రారంభించారు.అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ టిపి నేత షర్మిల మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, కబ్జాల గురించి వనపర్తి సభలో చెప్పారని అయన గుర్తు చేశారు. అదే విదంగా బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి నిరంజన్ రెడ్డి ఆస్తులు, కబ్జాల వివరాలు వెల్లడించారని, వనపర్తి నేతలు, ప్రతిపక్షం నేతలు నోరు మెదపలేదని అయన విమర్శించారు.
వనపర్తిలో రోడ్ల వెడల్పు పద్ధతి ప్రకారం చేయకుండా నచ్చిన విదంగా చేస్తున్నారని అయన చెప్పారు. వనపర్తి అవినీతిపై టిబెట్ పెట్టాలని అయన కోరారు. తెలంగాణ నిధులను ఇతర రాష్ట్రాలకు మళ్లీస్తున్నారని విమర్శించారు.వనపర్తిలో పార్టీ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్ బూజల వెంకటేశ్వర్ రెడ్డి కే. వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ముమ్మడి చాణిక్య వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు బి.భాస్కర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు ఎస్ రాజశేఖర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ బొడ్డుపల్లి సతీష్ జిల్లా యువత అధ్యక్షుడు టి పరమేష్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి అన్వర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు నందిమల్ల బాలరాజ్ జిల్లా కార్యదర్శి అవినాష్ జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు పి లోకేష్ యూత్ టౌన్ ప్రెసిడెంట్ కోన ఆంజనేయులు పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మండల అధ్యక్షుడు జె.కృష్ణారెడ్డి, పెబ్బేరు మండల్ ప్రధాన కార్యదర్శి కె. తిరుపతయ్య ప్రచార కార్యదర్శి మైదుకూరు మైనుద్దీన్ దుబాయ్ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి, సైకిల్ కురుమన్న, జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి, నిరంజన్ ప్రచార కార్యదర్శి, ఏ. సందీప్, మండల యూత్ అధ్యక్షుడు, నాని ప్రతాప్, ప్రచార కార్యకర్త సభ్యులు శివ, పాన్గల్ యూత్ అధ్యక్షుడు రాము సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్