తెలంగాణ రాష్ట్ర మొత్తం మార్కెటింగ్ శాఖ లో జరిగే సమావేశాల్లో జెడ్ పి టి సి లను శాశ్వత సభ్యులుగా అంగీకరించడానికి నూతన జీఓ ను తెస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మార్కెటింగ్ శాఖ లో జరిగే సమావేశాల్లో జడ్పిటిసి లకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని గత ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో కోరిన వెంటనే శాసనసభ్యులుగా అంగీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిఅదే విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తూ జెడ్పిటిసిలకు మార్కెటింగ్ కమిటీ సాధారణ సమావేశాలకు శాశ్వత సభ్యులుగా చేయాలని రాష్ట్ర పంచాయత్ రాజ్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రధాన కార్యదర్శి అశోక్ రావు జెడ్పీటీసీ సంఘం అధ్యక్షుడు నగేష్ అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఆయన స్వగృహంలోకోరారు.
స్పందించిన మంత్రి వెంటనే తప్పకుండా త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.