నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానానికి ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనసమండలి దర్బార్ హాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నెల 9న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.