40.2 C
Hyderabad
May 5, 2024 17: 50 PM
Slider ముఖ్యంశాలు

‘ఎన్ .టి .ఆర. 100 అడుగుల విగ్రహమే లక్ష్యం’ – జనార్దన్

#Janardhan

ఎన్ .టి .ఆర్. శతాబ్ది సందర్భంగా 100 అడుగుల విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పాలన్న సంకల్పంతో తాను అమెరికాలో పర్యటిస్తున్నానని ఛైర్మన్ టి .డి . జనార్దన్ తెలిపారు .అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన తానా సభల్లో పాల్గొన్న జనార్దన్ అట్లాంటాలో ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొన్నారు .

ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ .. ఎన్ .టి .ఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా కమిటీ అన్న గారి శాసన సభ ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలు , శకపురుషుడు అన్న పుస్తకాలను వెలువరించింది . వీటిని విజయవాడ , హైదరాబాద్ లో జరిగిన సభల్లో ఆవిష్కరించాము . ఇప్పుడు అన్న గారి స్మృతి తర తరాలు ఉండేలా 100 అడుగుల విగ్రహాన్ని అన్ని హంగులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చెయ్యాలని సంకల్పించామని చెప్పారు .

తానా సభల్లో ఎన్ .టి .ఆర్ కు తాము ఊహించని విధంగా అపూర్వ నివాళి ఘటించారని , తమ ప్రయత్నానికి అందరూ సానుకూలంగా స్పందించారని జనార్దన్ తెలిపారు .అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అట్లాంటాకు వచ్చానని , ఇక్కడ అన్న గారి అభిమానులు , తెలుగు దేశం నాయకులు చూపించిన ఆదరాభిమానాలు మర్చిపోలేనని , శకపురుషుడు ఎన్ .టి .ఆర్ కు ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘనంగా సాగుతుందని ఇప్పటికే రుజువయ్యింది ,

అట్లాంటాలో తమకు అన్నివిధాలుగా మద్దతు ఇస్తామని ఇక్కడి ప్రవాసాంధ్రులు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనార్దన్ తెలిపారు .అమెరికాలో వున్న ఎన్ .టి .ఆర్ .సెంటినరీ కమిటీ సభ్యుడు అట్లూరి అశ్విన్ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు .

Related posts

ఫెస్టివల్ మూడ్: బాసర ఆలయంలో వసంత పంచమి ఏర్పాట్లు

Satyam NEWS

జర్నలిస్ట్ నాయకులు అంబటి ఆంజనేయులు మృతికి చంద్రబాబు సంతాపం

Bhavani

మద్యం సరఫరా అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడి

Satyam NEWS

Leave a Comment