28.7 C
Hyderabad
April 28, 2024 06: 31 AM
Slider ముఖ్యంశాలు

మద్యం సరఫరా అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడి

#Constable

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అడ్డువచ్చిన ఎక్సైజ్ పోలీసులపైనే దాడి చేస్తున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం లో కొద్ది సేపటి కిందట ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యం బాటిళ్లను కొందరు తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు.

అయితే వారు కానిస్టేబుల్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కానిస్టేబుల్ మిండిబోను రమేష్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్ రమేష్ కు కంటి పై తీవ్ర గాయాలు తగిలాయి.

వెంటనే అతడిని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేశారు. కానిస్టేబుల్ కంటిపై తీవ్ర గాయం అయింది.

అక్కడి ప్రభుత్వ మధ్యం దుకాణం నుంచి సుమారు 50 మద్యం బాటిల్స్ తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని, మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించారు.

అక్కడ ఈ దాడి జరిగింది. మద్యం తరలిస్తున్న వ్యక్తి తన అనుచరులతో కలిసి కార్యాలయం వద్దనే కానిస్టేబుల్ పై దాడి చేశాడు.

Related posts

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమంలో యోగా దినోత్సవం

Satyam NEWS

నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ కి జాతీయ అవార్డు

Satyam NEWS

కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు సిద్ధం

Satyam NEWS

Leave a Comment