ప్రముఖ జర్నలిస్టు ఉద్యమ నాయకులు, ఏపీయూడబ్ల్యూజే సంఘ నేత అంబటి ఆంజనేయులు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆంజనేయులు గారు కోలుకుంటున్నారు అనుకున్న సమయంలో ఆయన ఇలా అందరినీ విడిచి వెళ్ళడం బాధాకరం అన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేసిన వ్యక్తిగా ఆంజనేయులు గారు అందరికీ గుర్తుండి పోతారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంజనేయులు గారి మృతి జర్నలిస్ట్ వర్గానికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు నాయుడు ప్రార్థించారు.