తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి సర్వేకు వెళ్ళిన అధికారులను గృహ నిర్భంధం చేసిన ఘటన మహాబూబబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో జరిగింది.
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వే నమోదుకు వెళ్ళిన గ్రామపంచాయతీ కార్యదర్శి, కారోబార్ లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్, గ్రామస్తులు గృహ నిర్భంధం చేశారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ తోపాటు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేస్తు అధికారులను గృహంలో నిర్భంధించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.