37.7 C
Hyderabad
May 4, 2024 13: 38 PM
Slider విజయనగరం

అయ్యా మంత్రి బొత్స గారు…. చీపురు పల్లికేంచేశారు…!

#Kimidi Nagarjuna

ఈ నాలుగేళ్ళ లో చీపురు పల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ,మంత్రి బొత్స ఏం చేసారో చెప్పాలని…టీడీపీ విజయనగరం జిల్లా నేత కిమిడి నాగార్జున ప్రశ్నించారు విజయనగరం వచ్చిన మంత్రి బొత్స… కలెక్టరేట్ వద్ద మీడియా తో మాట్లాడుతూ… కుప్పాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అస్సలు అభివృద్ధి చేయలేదని అన్నారు.

దాన్ని ఖండించిన విజయనగరం టీడీపీ నేత నాగార్జున జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండించారు. బాబు గురించి మాట్లాడిన మంత్రి బొత్స… వైఎస్సార్సీపీ లో చేరి..చీపురుపల్లి ఎమ్మెల్యే గా మంత్రి గా ఉన్న బొత్స సత్యనారాయణ…మరి చీపురు పల్లికి ఏం చేసారో చెప్పాలన్నారు.

నియోజకవర్గంలో వెదుల్లవలస ,సుభద్రాపురం ,గర్భాం రహదారులు అధ్వాన్నంగా ఇప్పటికీ ఉన్నాయని నాగార్జున అన్నారు. దీన్ని మరచి ..టీడీపీ అధినేత గురించి కామెంట్ చేయడం సిగ్గు చేటని అన్నారు.వైఎస్సార్సీపీ లో చేరిన…విజయనగరం తో పాటు చీపురు పల్లిని ఇసు మంత అభివృద్ధి జరగలేదన్నారు.

కాంగ్రెస్ హాయాంలో ఉన్నప్పుడే..కొంతైనా అభివృద్ధి అనే పదానికి నాంది మాత్రమే పలికారని నాగార్జున ఎద్దేవా చేశారు. టీడీపీ హాయాంలో నే…విజయనగరం జిల్లా లో సాగు, తాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయని నాగార్జున గుర్తు చేశారు.

Related posts

ఢిల్లీ ఇళ్లల్లో ఊపిరి తీసుకోలేని స్థాయిలో వాయుకాలుష్యం

Sub Editor

ధరణి తో లక్షల కోట్ల కుంభకోణం

Bhavani

విద్యుత్ చార్జీల మోతపై టీడీపీ భత్యాల వర్గీయుల ధర్నా

Satyam NEWS

Leave a Comment