అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ స్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ పెంచిన విద్యుత్ చార్జీల పెరుగుదలకి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైసీపీ మూడున్నర యేండ్ల పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీల మోత మోగించడం పై ధర్నా చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు భత్యాల చెంగల రాయుడు వర్గీయులు నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట,సిద్దవటం, నందలూరు,వీరపల్లె,సుండుపల్లె లోని విద్యుత్ సబ్ స్టేషన వద్ద ఈ ధర్నా చేపట్టారు.
previous post