భద్రాచల రామాలయం ఆన్లైన్ సేవలను ఈవో రమాదేవి ప్రారంభించారు. https://bhadradritemple.telangana.gov.in అధికారిక వెబ్సైట్లో నిత్య కల్యాణం, అభిషేకం, అర్చన, దర్శనం, సుప్రభాతం, పవళింపు, తులాభారం, వేదాశీర్వచనం, పట్టాభిషేకం, రథసేవలు వంటి టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ మేరకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వసతి సదుపాయాన్ని ఆన్లైన్ చేయాల్సి ఉందని వివరించారు. నేరుగా ఆలయానికి వచ్చే భక్తులు పాత విధానంలోనే రసీదులు తీసుకోవాలన్నారు. తొలి ఆన్లైన్ టికెట్(వెండి రథసేవ)ను ఏఈవో భవానిరామకృష్ణారావు రూ.1,116 చెల్లించి బుక్ చేసుకున్నారు. ఏఈవో శ్రావణ్కుమార్, ఈఈ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.