మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును పురస్కరించుకుని ఖమ్మం నగర టిఆర్ఎస్ కమిటి అధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్స్ తో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. శ్రేణులు ఆనందోత్సవాల నడుమ బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకుంటు సంబరాలు జరుపుకున్నారు. అన్ని ప్రధాన కూడళ్లో బాణసంచా కాల్చి జై తెలంగాణ, జై కేసీఅర్, జై పువ్వాడ అంటూ నినాదాలు చేశారు. మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం నుండి ఇల్లందు సర్కిల్, కలెక్టరేట్, జడ్పీ సర్కిల్, జమ్మిబండ, చెరువు బజార్, బొనకల్ x రోడ్, చర్చ్ కాంపౌండ్, జహీర్ పురా పార్క్, కిన్నెరసాని, గాంధీ చౌక్, గుంటి మల్లేశ్వరస్వామి దేవాలయం, నయాబజార్, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ పాత బస్ స్టాండ్ మీదగా తెరాస జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు.
previous post
next post