కడప జిల్లా శ్రీ ఒంటిమిట్ట కోదండ రామ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ ఒంటిమిట్ట కోదండ రామ స్వామి వారికి పద్మ శాలియులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజంపేట నియోజకవర్గ పద్మశాలీల తో కలిసి పట్టువస్త్రాలను రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి , రాష్ట్ర పద్మశాలి చైర్మన్ జింకా విజయలక్ష్మి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు నియోజకవర్గ పద్మశాలీలు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.