సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భవిత కేంద్రంలో డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు నేతృత్వంలో శుక్రవారం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను దివ్యాంగులైన చిన్నారులకు అందించారు.
ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ఎండలు మెండుగా ఉన్నాయని,వడగాల్పులు వీస్తున్నాయని,సాధ్యమైనంత వరకు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు.నీరసంగా గాని, వడదెబ్బ తగిలిందనిపించినా ఓ ఆర్ ఎస్ పాకెట్ ఒకటి ఒక లీటరు నీటిలో కలిపి తాగితే ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారౌతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పుత్లి బేగం,ఐ ఈ ఆర్ పి లు శ్రీనివాస్, గోవింద్,మనీషా,నరేష్,భవిత కేంద్రం చిన్నారులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్