29.7 C
Hyderabad
May 3, 2024 06: 27 AM
Slider ముఖ్యంశాలు

ఉస్మానియా డాక్టర్స్ సేఫ్

#Osmania Doctors

హిమాచల్ ప్రదేశ్​వరదల్లో చిక్కుకున్న ఉస్మానియా డాక్టర్లు సురక్షితంగా ఉన్నారు. మనాలియాలో ఉన్న డాక్టర్లు అధికారుల సాయంతో ఢిల్లీ చేరుకున్నారు. మంత్రి హరీష్​రావు ఆదేశాలతో సదరు డాక్టర్లను హైదరాబాద్‌కు తరలించనున్నారు. దీంతో మంత్రి హరీష్‌కు వైద్యసంఘాలు థాంక్స్​చెప్పారు.

ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. గత నెల 28న ట్రిప్‌కి వచ్చామని, జూలై 8 వరకు తమ యాత్ర బాగానే కొనసాగినా.. వరదల వలన ఆ తర్వాత ఇబ్బందులకు గురైనట్లు పేర్కొన్నారు. మానాలియాకు చేరుకునే సమయంలోనే మంచు రాళ్లు రోడ్డు మీద పడటంతో భయబ్రాంతులకు గురైనట్లు పేర్కొన్నారు.

ముగ్గురు డాక్టర్లు యువకులం కావడంతో ధైర్యం చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామన్నారు. విషయం తెలుసుకున్న తమ స్నేహితులు మంత్రి కేటీఆర్, హరీష్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ట్వీట్ చేయగా రెస్పాండ్ అయినట్లు చెప్పారు.

మంత్రి హరీష్​రావు పీఆర్‌వో ఎప్పటికప్పుడు ఫోన్‌లో టచ్‌లో​ఉన్నారని, దాని అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటామన్నారు. డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్‌లు ఈ యాత్రలో ఉన్నారు.

Related posts

గుజరాత్ లో బలంగా వీస్తున్న మోదీ హవా

Satyam NEWS

31న జరిగే ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయండి

Satyam NEWS

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

Satyam NEWS

Leave a Comment