సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వాసవి భవన్ నందు గురువారం నిర్వహించిన ప్రైవేటు స్కూల్స్ బస్సు డ్రైవర్ల సమావేశానికి ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నియోజకవర్గం లోని పలు గ్రామాల నుండి సమావేశమైన డ్రైవర్లను ప్రత్యేక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్లతోపాటు వందల మంది ఆటో కార్మికులు జీవనం సాగిస్తూన్నారని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆటో కార్మిక సోదరులకు ఎల్లప్పుడూ తన సహయ సాకారాలు ఉంటాయని రఘు తెలిపారు. నియోజక వర్గంలో అనేక స్వచంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి సాధికారత బాధ్యత తనదే అని,పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ఎల్లవేళలా ఆర్థిక చేయూత ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న,డ్రైవర్లు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్