గిరిపుత్రులు అంటే మరెవ్వరో కాదు గిరిజనులు. కొండ ప్రాంతంలో నివసించే వారు.. ఆయా ప్రాంతాల్లో పండిన పండుతున్న వాటినే తింటూ జీవనం సాగిస్తూ ఉంటారు. గడచిన కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు… గిరిజన కార్పొరేషన్ ద్వారా అటవీ, కొండల ప్రాంతంలో పండిన వాటిని… జనారణ్య ప్రదేశాల్లో తెచ్చి స్టాల్స్ ద్వారా అటవీ ఉత్పత్తులను అమ్మడం జరుగుతోంది. తాజాగా జగన్ ప్రభుత్వం…గిరిజన సంక్షేమ శాఖా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాక నామినేటెడ్ పోస్ట్ ను కూడా ఇచ్చారు.
అయితే ఆ గిరిజన సంక్షేమ శాఖ బోర్డు డైరెక్టర్ గా శోభా స్వాతి రాణి..తన మార్క్ ను చూపించేంందుకు గిరిజన కార్పొరేషన్ గొడౌన్ ల వద్దే స్టాల్స్ పెట్టించి…గిరిజన ఉత్పత్తులు అయిన కాఫీ, సబ్బు లు ,కుంకుడు కాయ ,పసుపు లను విక్రయిస్తోంది…జీసీసీ.ఇందులో భాగంగా నే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఏళ్ల తరబడి ఉన్న జీసీసీ సబ్బుల తయారీ కేంద్రం వద్ద అలాంటి స్టాల్ ను పెట్టారు… జిల్లా అధికారులు. ఇక నుంచే ఏ గిరిజన ఉత్పత్తి కావాలన్న…సదూ ర ప్రాంతాలకు వెళ్లక్కరలేదని “సత్యం న్యూస్. నెట్ ” ప్రతినిధి తో అంటున్నారు.