బిచ్కుంద మండలంలోని బండారెంజల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం, పుల్కల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఫథలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించి తమ తమ పంటలను అమ్ముకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, బండరెంజల్ సర్పంచ్ గడ్డం బాల్రాజ్ ,పుల్కల్ సొసైటీ చైర్మన్ ఇందిరా దేశాయి,వైస్ చైర్మన్ రామిరెడ్డి ,పుల్కల్ గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి ,ఫతలాపూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ్కుమార్ ,సొసైటీ చైర్మన్ బాలాజీ ,వైస్ చైర్మన్ యాదవరావు ,సీఈవో శ్రావణ్ కుమార్ ,మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు ,తహశీల్దార్ వెంకటరావు ,వ్యవసాయాధికారి పోచయ్య ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.