38.2 C
Hyderabad
May 2, 2024 21: 27 PM
Slider హైదరాబాద్

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా

#bandari

అర్హులైన వారందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్ని అందేలా కృషి చేస్తానని  ఉప్పల్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలవాలంటే బిఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుకు ఓటు వేసి, కేసీఆర్ ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయ్యాలని కోరారు. సోమవారం  ఉప్పల్ డివిజన్ లోని సాయిబాబా కాలని, విజయపురి కాలనీల నుండి నూర్ బాషా, దూదేకుల , బి సి బి, ముస్లీం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఉప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్యతిథిలుగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి  బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ తన గెలుపుకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన రెండు సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తన దృష్టికి తీసుకువచ్చిన కాలనీలోని  సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారు. అర్హులైన వారందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్ని అందేలా కృషి చేస్తానని మాటిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలవాలంటే బిఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుకు ఓటు వేసి, కేసీఆర్ ని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయ్యాలని కోరారు.  

ఈ నేపథ్యంలో కేసీఆర్ దయవల్ల మాకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయంటూ, కేసీఆర్ మేలు ఎన్నటికీ మర్చిపోలేమని, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని, కాంగ్రెస్, బిజెపి నాయకులు ఇచ్చే అమలుకాని హామీలు నమ్మే పరిస్థితిలో తాము లేమన్నారు. నిత్యం పేద ప్రజలకు అండగా ఉండి, ఆపదలో వచ్చినవారిని అన్నివిధాలుగా ఆదుకుంటూ, మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే బలమైన నాయకుడు బండారి లక్ష్మారెడ్డి  కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తాం అంటూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు

Satyam NEWS

కరోనా కష్టాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

Satyam NEWS

కార్పొరేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment