నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి,మాజీ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,పేదవారికి భోజనం ప్యాకెట్స్ ను అందజేసినారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు మాట్లాడుతూ పద్మావతి రెడ్డి 30 సంవత్సరాల నుండి కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే తమ కుటుంబ సభ్యులుగా భావించి తన జీవన ప్రయాణం సాగిస్తూ రాజకీయంగా ఉత్తంకుమార్ రెడ్డి కి చేదోడు వాదోడుగా ఉంటూనే తనదైన శైలిలో రాజకీయంగా ముందుకు సాగుతూ రెండు నియోజకవర్గాల ప్రజల కష్ట,సుఖాలలో పాలు ఉంటున్నారని,వారికి మంచి ఆయురారోగ్యాలతో,భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాచిమంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య,కోతి సంపత్ రెడ్డి,మాజీ జెడ్ పి టి సి గల్లా వెంకటేశ్వర్లు,సైదా మేస్త్రి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,దొంతగాని జగన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్