అగ్నిపథ్ పథకంలో లోపాలను సవరించాలని విన్నపం ఒక పోరాటం లీలావతి చీకూరి డిమాండ్ చేశారు. భారత త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్రొత్త పథకం అగ్నిపథ్ పథకం గురించి సైన్యంలో చేరాలని ఆశతో ఉన్న నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు.
అగ్నిపథ్ పథకంలో లోపాలను,జరిగే నష్టాన్ని ప్రతిపక్షాలు ఖండించటంలో విఫలం అయ్యారని,యువత ఏది మంచి ఏది చెడు తెలుసుకునే అయోమయంలో దేశ సంపాదనను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందంటే అధికార దాహంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లుతాయన్న ఆలోచన ధోరణి ఉన్న కేంద్ర నిర్ణయాల వలన యువత ప్రాణాలను కోల్పోతుందని అన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య యువత ఆవేశంతో దేశ సంపద అయిన రైల్వే స్టేషన్ ఆస్తి నష్టం కలిగించడమే కాకుండా ప్రాణాలను కూడా వదిలేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీసు కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైందని అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గోపాలపురం విన్నపం ఒక పోరాటం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చీకూరి లీలావతి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో నిర్మల,సంధ్య, అనూష,అశ్విని,జాస్మిన్,గాయత్రి,వానరాసి విజయ్ కుమార్,వి.నాగార్జున్,డి. వెంకటేష్,షేక్ పంగుజ్,ఆర్.దినేష్,టి. మహేష్,జి.గోపి,బి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్