ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ పంచ్ మహల్ లో జూన్ 21న “అంతర్జాతీయ యోగా దినోత్సవం” పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, రాజ్యసభ డిప్యూటీ లీడర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పెద్ద సంఖ్యలో ప్రజలతో యోగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించనున్నారు. నఖ్వీతో పాటు, రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే, ఫతేపూర్ సిక్రీ లోక్సభ ఎంపీ రాజ్కుమార్ చాహర్, ఎమ్మెల్యే బాబులాల్ చౌదరి, ఎమ్మెల్యే పురుషోత్తమ్ ఖండేల్వాల్ ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమాన్ని నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (NMDFC), మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అంతే కాకుండా పంచ మహల్లో నిర్వహిస్తున్న “అంతర్జాతీయ యోగా దినోత్సవం” కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఫతేపూర్ సిక్రీ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, పాఠశాలల నుండి సుమారు 3500 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
“అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా, అతిథులు మరియు సామాన్య ప్రజలు ఉదయం 6 గంటలకు పంచ్ మహల్ వద్ద సమావేశమవుతారు. ఆ తర్వాత నఖ్వీ ప్రసంగిస్తారు. ఉదయం 6:40 గంటలకు హాజరైన ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వింటారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు.. ఈ సమయంలో హాజరైన వారు కేంద్ర మంత్రి నఖ్వీ మరియు ఇతర ప్రముఖులతో కలిసి యోగా చేస్తారు.