ఆంధ్రజ్యోతి, శివరంజని, చిత్రాంజలి, చిత్రం” పత్రికల్లో పని చేసి, “పి.ఆర్.ఓ”(PRO)గా ఒక వెలుగు వెలిగి, “అదిరిందయ్యా చంద్రం, పెళ్ళి కాని ప్రసాద్, ఏం బాబూ లడ్డూ కావాలా?” తదితర చిత్రాలకు “ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్”గా నిర్మాణ బాధ్యతలు వహించిన పెదిరెడ్ల త్రినాథ్ (47) ఇక లేడు. నిన్న రాత్రి (జులై 3) 11.30 గంటలకు తుది శ్వాస విడిచాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న… త్రినాథ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, పాపికొండలు సమీపంలోని “కొండమొదలు”. తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న “రంగస్థలం, పుష్ప, ఆచార్య” చిత్రాలకు త్రినాథ్ షూటింగ్ “కో – ఆర్డినేటర్”గా పని చేశాడు.