పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ కి కరోనా పాజిటీవ్ వచ్చింది. పాకిస్తాన్ లో ఇప్పటికే ఎంతో మంది అధికార పీటీఐ పార్టీ సభ్యులకు కరోనా సోకగా తాజాగా విదేశాంగ శాఖ మంత్రి కే వచ్చింది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఫిబ్రవరి 26న తొలి పాజిటీవ్ కేసు నమోదు కాగా ఇప్పటి వరకూ 4,500 మందికి పైగా మరణించారు.
జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ కైసర్, సింధ్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్, పిపిపి లీడర్ సయీద్ ఘనీ రైల్వే మంత్రి షేక్ రషీద్ లకు కరోనా పాజిటీవ్ వచ్చింది. బెలూచిస్తాన్ మాజీ గవర్నర్ సయ్యద్ ఫాజల్ ఆఘా, పీటీఐ పంజాబ్ ఎంపిఏ షహీన్ రజా, సింధ్ మంత్రులు గులామ్ ముర్తజా బలూచ్, ఎంఎన్ఏ మునీర్ ఖాన్, పీటీఐ ప్రధాన నాయకుడు జంషదుద్దీన్ కాకాఖేల్ లు కరోనా సోకి మరణించారు.