పాకిస్తాన్ లో జరుగుతున్న రాజకీయ తిరుగుబాటుతో ఆ దేశం ఆర్ధికంగా తీవ్ర వత్తిడికి లోనవుతున్నది. ఇప్పటికే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దాంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ భారీగా తగ్గిపోయింది. క్షీణిస్తున్న విదేశీ నిల్వల కారణంగా బడ్జెట్ లోటు తీవ్రమౌతున్నది.
కొనసాగుతున్న రాజకీయ గందరగోళం కారణంగా ఇప్పటికే పాక్ కరెన్సీ అధ:పాతాళానికి చేరిందని బ్లూమ్బెర్గ్ నివేదిక ఎత్తి చూపింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలోని డాలర్ బాండ్లు ఇప్పటికే 5 శాతం క్షీణించాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో అంగీకరించిన సంస్కరణలను అమలు చేయడం ప్రస్తుతం సాధ్యం కానందున పాకిస్తాన్కు ఇచ్చిన 6 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని నిలిపివేయడానికి IMF సిద్ధం అవుతున్నది. ఇదే జరిగితే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ మరింత క్షీణిస్తుంది. రాజకీయ పోరాటం కారణంగా కరెంట్-ఖాతా లోటుపై అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనివల్ల పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.