కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియ చేశారు. కెసిఆర్, నరేంద్ర మోడీల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. టీపీసీసీ సీనియర్ నాయకులు డా. సత్యం శ్రీరంగం, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఫతే నగర్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, ఐ.రమేష్, రాజు ముదిరాజ్, సురాజ్ తివారి, మట్టే ప్రసన్న కుమార్, ఎరుపుల మహేందర్, INTUC నాయకులు భాస్కర్, మురళి కృష్ణ యాదవ్, అరుణ్, కిరణ్, రిషి యాదవ్, మహాదేవ్, NSUI అధ్యక్షుడు సూర్య, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post