రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సౌజన్యంతో వనపర్తి ఆవోప (ఆర్యవైశ్య) ఉద్యోగుల సంఘం, బాలాజీ వాకింగ్ గ్రూప్, వనపర్తి మున్సిపల్ కార్యాలయం ఉద్యోగ సిబ్బంది ఏదుల రిజర్వాయర్ ను సందర్శించారు. ఆసియాలోనే అతిపెద్ద145 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లతో కృష్ణా జలాలు ఎత్తి పోతల పథకం ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరున అందించే అతి పెద్ద రిజర్వాయర్ ప్రక్రియను చూడటానికి కళ్ళు సరిపోవటం లేదని వారు ఆశ్చర్యపోయరు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి నీళ్ల నిరంజన్ రెడ్డికి ఈ ప్రాంతం రైతులు ప్రజలు రుణపడి ఉంటారని అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తుందని ఎంత కృషి చేశారని ఆశ్చర్యపోయారు. కేసీఆర్, నిరంజన్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంలో మంత్రి సతీమణి వాసంతి వారితో కలిసి భోజనం చేసి ప్రాజెక్టు వివరాలను ఇంజనీర్ల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్చార్జి అరుణ్ ప్రకాష్, బలిజపల్లి గ్రామ సర్పంచ్ శుశాంతి, బి ఆర్నా ఎస్ నేత ఉంగ్లo తిరుమల్ (ఆర్యవైశ్య సంఘం) నాయకులు ఆవోప అధ్యక్షుడు శ్రీనివాసులు, కటకం శ్రీధర్, రాజు, నూకల వెంకటేష్, ప్రసాద్, శ్రీనివాసులు రాఘవేంద్ర ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్