తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమయాన్ని కేటాయించాల్సి అవశ్యకత చాలా ఉందని ఐ సి డి ఎస్ సిడిపిఓ విజయలక్ష్మీ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో గురువారం జరిగిన (ఫ్యామిలీ ఫిస్ట్) కుటుంబ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు సంపాదించేందుకు కష్టపడుతున్నారని,దాని కంటే కుటుంబ విలువలను,నైతిక విలువలతో కూడిన జీవితం ఇవ్వడమే ముఖ్యమని అన్నారు.విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను,పెద్దలను గౌరవించాలని సూచించారు.అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదార్చన చేసి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్న పిదప. బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రమణా రావు,డీన్ నాగ సైదులు,శ్రీనివాస రెడ్డి, ఏఓ వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్