జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ ఎగ్జిక్యూటీవ్ మెంబెర్స్ సైదులు యాదవ్, హాసంమియా జనసేన అధినేత పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్బంగా స్థానిక శ్రీనివాస థియేటర్ లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
తర్వాత వారు మాట్లాడుతూ ప్రజలకీ ఎటువంటి పరిస్థితులోనైన సేవ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుందని, తెలంగాణలో అదేవిధంగా హుజుర్ నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని , సమస్యలపై పోరాడటానికి ప్రజలకి అండగా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు.
అనంతరం కేక్ కట్ చేసి అధినేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.