29.7 C
Hyderabad
May 4, 2024 05: 00 AM
Slider ఖమ్మం

కేసీఆర్ పాలనతో ప్రజలు నష్టపోయారు

#ponguleti

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసిందని… ఆ పార్టీ నేతలందరూ ఇంటికి పరిమితమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం రామచంద్రపురం, సుర్దేపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ రెండు గ్రామాల్లోని ప్రతి గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. హస్తం పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలంతా విస్తుపోయారని పేర్కొన్నారు. ఇంకో 50 రోజులు మాత్రమే బీఆర్ఎస్ కు మిగిలి ఉన్నాయన్నారు. ఆ తరువాత ప్రజలు కోరుకుంటున్న ఇందిరమ్మ రాజ్యమే అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో ప్రసాద్ రెడ్డి వెంట మోహన్ రెడ్డి, పల్లెబోయిన లక్ష్మినారాయణ, లక్కం ఏడుకొండలు, నెల్లూరి భద్రయ్య, శ్రీను, కొడాలి గోవిందరావు, చెర్వు స్వర్ణ, మామిడి వెంకన్న, మన్నె నగేష్, అనంతు సత్యం, కట్టెకోల సుధాకర్, వాకా శ్రీనాథ్, జాన్ రెడ్డి, చిలకల సీతారావమ్మ, గరిడేపల్లి రామారావు, కడియాల శ్రీసు, చింతనిప్పు సైదులు, సీత్యా తదితరులు ఉన్నారు.

Related posts

గవర్నర్ ను కలవబోతున్న రాష్ట్ర ఎన్నికల అధికారి

Satyam NEWS

దళిత కాలనీలో MLA ఆకస్మిక పర్యటన

Satyam NEWS

ఎగుమతులు నిషేధించినా పెరగడం ఆగని గోధుమ ధరలు

Satyam NEWS

Leave a Comment