జగన్ ప్రభుత్వం పై ప్రతీ ఒక్కరూ వ్యతిరేకంగా నే ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె టీడీపీ నేత ఆదితీ గజపతిరాజు అన్నారు. విజయనగరం లో పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వచ్చిన నేపథ్యంలో ఆదితీ గజపతిరాజు మాట్లాడారు. జగన్ ప్రభుత్వ హాయాంలోనే డ్రగ్స్ పంపిణీ అంశం వెలుగులో కి వచ్చిందని ఆమె అన్నారు. స్వయంగా యూత్ అలాగే కాలేజీ విద్యార్ధినీ విద్యార్థులు సరాసరి అశోక్ బంగ్లాకు వచ్చి చంద్రబాబు కు చెప్పండని ఫిర్యాదులు ఇస్తున్నారని ఆమె తెలిపారు.
విజయనగరం లో చాప కింద నీరులా…డ్రగ్స్ దందా నడుస్తోందని దానికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆదితీ ఆరోపించారు. మేమేమీ రేకెత్తించలేదని…ఈ అంశంపై పోలీసులనే కావాలంటే అడగాలని ఆమె అన్నారు. ఇక పోలీసు నియామకాల విషయంలో కేవలం ఏపీ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నియామకాలు జరుగుతున్నాయని ఆదితీ తెలియజేసారు. రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేసారని ఆమె ప్రశ్నించారు.