తమ ప్రాంతంలోని రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కరించాలని రైల్వేస్టేషన్లో పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ కోరారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను కర్నూల్ లో నేడ కలిశారు.
విజయవాడ నుంచి హుబ్లీ(17225,17226), హౌరా నుంచి వాస్కోడిగామా (18047,18048) కాచిగూడ నుంచి యలహంక(17603,17604) వెళ్లే రైళ్లను మద్దికెర స్టేషన్ లోనిలుపుదల చేయాలని ఈ ప్రాంతం నుంచి విజయవాడకు ఎక్కువగా ప్రజల తరలి వెళ్తుంటారని ఆమె కోరారు. అలాగే వెల్దుర్తి రైల్వే స్టేషన్లో రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని కోరారు. మద్దికేర నుంచి గుంతకల్ బ్రిడ్జి నంబర్ 14,13 మద్దికేర నుంచి తుగ్గలి 14-A గల బ్రిడ్జి నంబర్ లలో వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలువ ఉంటుందని.
దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.