26.7 C
Hyderabad
May 3, 2024 10: 45 AM
Slider చిత్తూరు

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

#roja

రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం సాయంత్రం నగరి మున్సిపాలిటీ కరకంఠాపురం సచివాలయం పరిధిలోని 17వ వార్డు నందు కరకంఠాపురం దళితవాడ మరియు బిసి కాలనీలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కి గడప గడపను ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలకోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవాళ్ళమని, ప్రస్తుతం అడగకుండానే, తిరగకుండానే అన్ని చేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మంచి మనసున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న మరియు ఇక్కడ మాకు అన్ని చేస్తున్న మీరు చల్లగా వుండాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో నగరి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్లర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీల చైర్మన్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయం కన్వినర్లు, గృహసారధులు, వాలంటీర్స్ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

24వరకు గాంధీ చిత్ర ప్రదర్శన

Bhavani

యాక్షన్: కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

Satyam NEWS

అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి

Satyam NEWS

Leave a Comment