రంగారెడ్డి జిల్లా కోహెడ్ లో ప్రభుత్వం పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలని తెలుగు దేశం పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధ్యపోగు రాజశేఖర్ డిమాండ్ చేశారు. కోహెడ్ లోని ప్రభుత్వం పండ్ల మార్కెట్ ను యాదాద్రి జిల్లా తెలుగు దేశం పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు కొలన్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మార్కెట్ లో షెడ్లు తాత్కాలిక నిర్మాణం జరుగుతుందని ఆరోపించారు. అవి కూడా నాసి రకం పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత నెలలో చిన్న గాలి వానకే మార్కెట్ లో షెడ్లు కూలి పోయాయని, వ్యాపారులు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
అయిన కూడా ప్రభుత్వం తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేపట్టడం శోచనీయమని పేర్కొన్నారు. రానున్నది వర్షాకాలమని నాసి రకం షేడ్లు వేస్టే రైతుల ప్రాణాలకే ప్రమాదమన్నారు. ప్రభుత్వం మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించి వ్యాపారులను కార్మికుల ను అదుకోవాలని వారు డిమాండ్ చేశారు.