దివంగత నేత పెసల జయప్రకాష్ 77వ జయంతి పురస్కరించుకుని నాయుడుపేట మండలం తలైపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందచేశారు. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నాయుడుపేట వాస్తవ్యుడైన జయప్రకాష్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పలువురు విద్యార్ధులకు బహుమతులు అందచేయడమే కాకుండా అక్కడ చెట్లు నాటే కార్యక్రమాలను నిర్వహించారు.
previous post