30.7 C
Hyderabad
April 29, 2024 04: 53 AM
Slider ముఖ్యంశాలు

ఆకునోనిపల్లిలో హాత్ సే హాత్ జోడో

#rangineni

వనపర్తి జిల్లా పానుగల్ మండలం, ఆకునోనిపల్లి గ్రామంలో నేడు జరిగిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ విచ్చేయడం జరిగింది. గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేస్తూ,భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ  ప్రవేశ పెట్టే పథకాలను తెలియజేయడం జరిగింది.

బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును గ్రామంలోని ప్రజలకు సవివరంగా తెలియజేస్తూ  ప్రభుత్వాలను ఎండగట్టారు. ఆకునోనిపల్లి గ్రామానికి గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు రోడ్డు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్డు సౌకర్యం త్వరితగతిన పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి , జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు లాలు కుమార్, తాలుకా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వహీద్, మండల ఉపాధ్యక్షుడు కురుమూర్తి, మండల యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తిరుమలేష్, గ్రామ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాకతీయులు నిర్మించిన చెరువులను కాపాడుకోవాలి

Satyam NEWS

ఎన్జీటీలో సీఎం జగన్‌కు మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

రామకృష్ణ కు నివాళులర్పించిన రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

Leave a Comment