భారతీయ త్రివర్ణ పతాకం రూపకర్త పింగిలి వెంకయ్య జన్మదినాన్ని గుర్తుచేస్తూ ఆయన సేవలను అందరికి తెలియాలి అని పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని,వెంకయ్య చిత్రపటంతో ఆయన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో బృందం సభ్యులు మాట్లాడుతూ నేడు భారతీయ గౌరవ ప్రతిష్టలు,ఐక్యమత్య,స్నేహ అనుబంధాలు అన్ని ఒక్కటనే చెప్పేది భారత్ త్రివర్ణ పతాకం ముఖ్య ఉద్దేశం,మతం,కులం,భాషలు వేరైనా మనం అందరం ఒక్కటనే సిద్ధాంతం త్రివర్ణ పతాకం లో ఉంది. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలి అని కోరారు.
కార్యక్రమంలో నాయకులు దుర్గాప్రసాద్,రాజేందర్,రవి గౌడ్,సేవా బృందం అధ్యక్షుడు శివ,వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి తేజ,సభ్యులు ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.