37.2 C
Hyderabad
May 1, 2024 12: 33 PM
Slider వరంగల్

రైతు బంధువు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్

#muluguzp

దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకి నేరుగా ఎకరానికి 10 వేల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మల్లంపెళ్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, రైతు భీమా ఇస్తున్న కెసిఆర్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ద్వారా అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని తెలిపారు. ఈరోజు తెలంగాణ రైతుల మొహాల్లో, వారి కుటుంబాల్లో ఆనందం నింపిన ఘనత కెసిఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, స్థానిక ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్,TRSY ములుగు నియోజకవర్గ ఇంచార్జి కోగీల మహేష్, విద్యాకమిటీ చైర్మన్ నేరెళ్ల గోపి జిల్లా సీనియర్ నాయకులు పిండి రవి యాదవ్ ద్రోణచారీ కృష్ణారెడ్డి తహీర్ పాషా  బొచ్చు సమ్మయ్య మాచర్ల రవి సిద్దర్ధ సందీప్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి చదలవాడ అండ

Satyam NEWS

ద‌ళితుల ఆత్మ‌విశ్వాసం పెంపొందించేలా కార్య‌క్ర‌మాలు

Satyam NEWS

పోచారం మున్సిపాలిటీ లో యథేచ్ఛగా సర్కారు భూములు కబ్జా…

Satyam NEWS

Leave a Comment