దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకి నేరుగా ఎకరానికి 10 వేల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మల్లంపెళ్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, రైతు భీమా ఇస్తున్న కెసిఆర్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ద్వారా అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని తెలిపారు. ఈరోజు తెలంగాణ రైతుల మొహాల్లో, వారి కుటుంబాల్లో ఆనందం నింపిన ఘనత కెసిఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, స్థానిక ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్,TRSY ములుగు నియోజకవర్గ ఇంచార్జి కోగీల మహేష్, విద్యాకమిటీ చైర్మన్ నేరెళ్ల గోపి జిల్లా సీనియర్ నాయకులు పిండి రవి యాదవ్ ద్రోణచారీ కృష్ణారెడ్డి తహీర్ పాషా బొచ్చు సమ్మయ్య మాచర్ల రవి సిద్దర్ధ సందీప్ తదితరులు పాల్గొన్నారు
previous post