27.7 C
Hyderabad
May 14, 2024 04: 44 AM
Slider విజయనగరం

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో చింతపల్లి బీచ్ వద్ద పోలీసులు బందోబస్తు…!

#ganeshimmersion

వినాయక చవితి సందర్భంగా మూడు రోజుల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగ చింతపల్లి బీచ్ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ మేరకు అదనపు ఎస్పీ సత్యనారాయణ… చింతపల్లి సముద్ర తీరాన్ని పరిశీలించారు.

స్థానికంగా సిబ్బంది చేస్తున్న బందోబస్తు తీరును..భోగాపురం సీఐ శ్రీథర్, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి లు..ఏఎస్పీకి వివరించారు.

ఈ మేరకు చింతపల్లి బీచ్ ను ఏఎస్పీ సత్యనారాయణ రావు  సందర్శించి, గణేష్ నిమర్జనం సందర్భంగా పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు.

Related posts

నిండుకుండలా మూసి నది

Bhavani

మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు

Bhavani

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

Leave a Comment