వినాయక చవితి సందర్భంగా మూడు రోజుల అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగ చింతపల్లి బీచ్ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ మేరకు అదనపు ఎస్పీ సత్యనారాయణ… చింతపల్లి సముద్ర తీరాన్ని పరిశీలించారు.
స్థానికంగా సిబ్బంది చేస్తున్న బందోబస్తు తీరును..భోగాపురం సీఐ శ్రీథర్, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి లు..ఏఎస్పీకి వివరించారు.
ఈ మేరకు చింతపల్లి బీచ్ ను ఏఎస్పీ సత్యనారాయణ రావు సందర్శించి, గణేష్ నిమర్జనం సందర్భంగా పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు.