కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ అధ్యక్షులుగా వంగ రవి యాదవ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు పట్టణ కమిటీని నియమించారు.
ఈ సందర్భంగా వంగ రవి యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను విజయవంతం చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.
తనను నమ్మి ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి కి అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాకు ములుగు పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కుల నర్సయ్య, యసం రవి కుమార్, హేమాద్రి,శర్పొద్దిన్ కి కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.