కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు వీరికి వత్తాసు పలకడం గమనార్హం.
ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కమిటీ లో సర్పంచ్ కూడా ఒక సభ్యులుగా ఉంటారు. కానీ ఏ సమావేశం జరిగినప్పటికీ సర్పంచ్ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహిస్తూ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి.
గత సంవత్సరం నుండి కోవిడ్ కారణంగా అన్ని పాఠశాలలో మూతపడడం విషయం విదితమే కానీ గర్భిణులకు బాలింతలకు పోషకాహారం అందించే పథకాలు వారి ఇంటికి వెళ్లి అందించాల్సిన ఆదేశాలు ఉన్నప్పటికీ అంగన్వాడి సెంటర్ల నిర్వాహకులు సూపర్వైజర్లు సరుకులు అందించకుండా ఇదే అదునుగా భావించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ విషయంపై వాజిద్ నగర్ సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ అంగన్వాడీ కార్యకర్తలకు వివరాలు అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం సర్పంచ్ సూపర్వైజర్ కొమురవ్వకు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సర్పంచ్ తో దురుసుగా మాట్లాడడం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ విలేకరులతో తెలిపారు.
జీ లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్