33.7 C
Hyderabad
April 29, 2024 01: 01 AM
Slider కడప

రాజంపేట ఇసుక క్వారీలో ఇసుక అక్రమ రవాణా పై టీడీపీ నేతల ఆందోళన….

#TDP

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మందరం వద్ద సోమవారం చెయ్యేరులోని అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు.రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అద్వర్యం వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం లో ఇసుక దోపిడీ పై క్వారీల వద్ద ఆందోళన లు చేయాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఆందోళన చేపట్టారు.

ఇసుక తోడగా ఏర్పడిన భారీ గోతులోని నీటిలో దిగి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలిచ్చినా లెక్క చేయకుండా రాజంపేట నియోజకవర్గ పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జె.పి.గ్రూప్ ఇసుక రవాణా చేస్తున్నా రంటూ ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాండ్, మైన్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని ఆరో పించారు.అక్రమ క్వారీపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS

బాలాపూర్ రికార్డు బ్రేక్.. అల్వాల్లో  45,99,999 లక్షలు పలికిన లడ్డు

Satyam NEWS

కబడ్డీ టైం:జిల్లాస్థాయి బాలబాలికల జూనియర్ సెలెక్షన్

Satyam NEWS

Leave a Comment