33.2 C
Hyderabad
May 4, 2024 00: 08 AM
Slider సినిమా

భూ వివాదంలో సినీ నిర్మాత సి.కల్యాణ్ పై కేసు

#c kalyan

భూ వివాదంలో సినీ నిర్మాత సి.కల్యాణ్ పై కేసు నమోదు అయింది.

హైదరాబాద్ లోని షేక్‌పేటలో ఉన్న ఒక  భూవివాదంపై కొందరు ఫిర్యాదు చేయడంతో సినీ నిర్మాత సి.కల్యాణ్ తో పాటు మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఫిర్యాదు పూర్వాపరాలు చూస్తే… అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు.

2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు.

అయితే నిన్న సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు.

స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితో పాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

దుబాయ్ లో రూ.15 వేల కోట్లు ఎగ్గొట్టిన మలయాళీలు

Satyam NEWS

ఫుల్లుగా తాగి మీడియాకు దొరికిన మధిర అధికారులు

Satyam NEWS

పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగేనా?

Satyam NEWS

Leave a Comment