38.2 C
Hyderabad
May 5, 2024 19: 08 PM
Slider కరీంనగర్

ఓనర్లు అనుకుంటున్నారా? కాదు వారే దొంగలు

jammikunta police

జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేష్, కాసుల భాస్కర్ అన్నదమ్ములు. గాంధీ చౌక్ లో శ్రీ విజయ లక్ష్మి ట్రేడర్స్ & జ్యూవెల్లర్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ డిసెంబర్ 31న భారీ చోరీ జరిగింది. ఒక్క సారిగా పట్టణంలో కలకలం. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు. చూశారు. అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగిందో తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ నేరాన్ని ఎలాగైనా ఛేదించాలని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ముందుగా నేర స్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరు పరిశీలించారు. అక్కడ వస్తువులు పడివున్న పద్దతి, నేరానికి ఉపయోగించిన పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బృందాలుగా ఏర్పడి అనుమానితులను విచారిస్తూ, సీసీ కెమెరాలను పరిశీలిస్తూ, అక్కడికి వచ్చి వెళ్లిన వారిపై నిఘావేశారు.

పాత నేరస్తుల కదలికలపై ఒక కన్నేశారు. పోలీసులు ఉపయోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సిసి కెమెరాలు నేరస్తులను పట్టించాయి. గత నెలలో బంగారం, వెండి కొనుగోలు చేసి, షాప్ పేరుపై ఇద్దరు అన్నదమ్ములు బిల్లులు తీసుకున్నారు.

డిసెంబర్ 31న ఇంట్లో బీరువాలను పగలగొట్టి, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి, దొంగతనం జరిగినట్లు చిత్రీకరించి, సొత్తును మొత్తం వేరు వేరు ప్రదేశాల్లోకి మార్చారు. ఆ ప్లాన్ లో భాగంగా భాస్కర్ ఇంటికి తాళం వేసి, తన భార్యకి బాగులేదని, హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి కుటుంబ సభ్యులతో కార్ లో వరంగల్ వెళ్లాడు.

అలాగే మహేష్ తన ఇంకో సోదరుడు, ఇతర వ్యక్తులతో కలిసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన షాప్ నిమిత్తం కేస్ పనిలో భాగంగా లాయర్ ని కలవాలని హైదరాబాద్ వెళ్లాడు. వరంగల్ వెళ్లి అదే రోజు రాత్రి జమ్మికుంట తిరిగి వచ్చిన భాస్కర్ అతను ఒక్కడే షాప్ దగ్గరకి వచ్చి వేసిన తాళం తీసి, తను ముందు గానే పగలగొట్టి పెట్టుకున్న తాళాన్ని ఇంటికి తగిలించి, తాళం  పగలగొట్టి చోరీ జరిగినట్లు గా చూపిస్తూ, నమ్మించి చుట్టు పక్కల షాప్ వాళ్ళకి భారీగా దొంగతనం జరిగినట్లు చిత్రీకరించాడు.

అలాగే మహేష్ కూడా హైద్రాబాద్ నుండి వస్తుండగా అతనికి ఫోన్ ద్వారా తెలిపినట్లు నటించారు. మహేష్ కూడా తిరిగి వచ్చాక ఎం తెలియనట్లు నటిస్తూ ఇద్దరు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం హైడ్రామా చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఆ వివరాలు నేడు మీడియాకు వెల్లడించారు. అన్నదమ్ములిద్దరూ బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టాలనే దొంగతనం నాటకం ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు.

వివిధ బ్యాంక్ లలో అధిక మొత్తంలో రుణాలు, అలాగే ఎస్బిఐ బ్యాంక్ లో ముద్రలోన్ కూడా భారీగా తీసుకున్నారు. తీసుకున్న రుణాలను ఎగ్గొట్టాలనే నెపంతో  పక్కాగా మాస్టర్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఈ నాటకం ఆడారు. జి.చంద్రమోహన్, అడిషనల్ డిసిపి (అడ్మిన్), ఎస్.శ్రీనివాసరావు, ఏసీపీ హుజురాబాద్ ఆధ్వర్యంలో కె.సృజన్ రెడ్డి,ఇన్స్పెక్టర్, జమ్మికుంట టౌన్, ఇ. కిరణ్,సిఐ, హుజురాబాద్ రూరల్, .టి. సత్యనారాయణ, ఎస్సై, జమ్మికుంట, ఎం.ప్రవీణ్ రాజ్,ఎస్సై, జమ్మికుంట, కె.కిరణ్ రెడ్డి,ఎస్సై,వీణవంక కేసు దర్యాప్తు చేశారు.

వీరే కాకుండా సీసీఎస్ టీం కె.శ్రీనివాస్ ,ఏసీపీ,సీసీఎస్, కె.రామచందర్ రావు, ఇన్స్పెక్టర్, సీసీఎస్, జి.ప్రసాద్,ఎస్సై,సీసీఎస్, జి.అశోక్ రెడ్డి,ఎస్సై,సీసీఎస్ టెక్నికల్ టీం టి. మురళి,ఆర్ఎస్సై, ఇంచార్జ్ ,సైబర్ ల్యాబ్ క్లూస్ టీం ఎం.శ్రీధర్,ఎస్సై,ఇంచార్జ్ ,క్లూస్ టీం కేసును ఛేదించడంలో చాక చక్యంగా వ్యవహరించారు.

వీరందరిని పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అభినందించారు. దొంగతనం జరిగినట్లు నమ్మించి తద్వారా బ్యాంక్ లోన్, ముద్ర లోన్ లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మోసం చేయాలని ఇలా ప్లాన్ చేశారని వారిద్దరూ నేరం అంగీకరించారని కమలాసన్ రెడ్డి చెప్పారు. చోరీ అయినట్లు చెప్పిన సొమ్ము మొత్తాన్ని రికవర్ చేశారు.

Related posts

ఎన్నికలలో చేసే ప్రతి ఖర్చును అభ్యర్థులు నమోదు చేయాలి

Satyam NEWS

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

విషవాయువు లీకేజీ విచారణకు కేంద్ర కమిటీ

Satyam NEWS

Leave a Comment