బిచ్కుంద మండలంలోని పెద్ద తక్కడపల్లి గ్రామంలో పలువురు దాతల సహాయంతో నిత్యావసర సరుకులైన బియ్యం ఇతర సరుకులను ఎంపిపి అశోక్ పటేల్ శుక్రవారం నిరుపేదలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు తహశీల్దార్ వెంకటరావు ఎంపిడిఓ ఆనంద్ మండల పరిషత్ అధికారి మహ్బూబ్ మాజీ జడ్పీటీసీ సాయిరాం పాల్గొన్నారు.
ఇంకా తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు సర్పంచ్ మేకల పుండలిక్ నాయకులు మల్లికార్జున్ నిరుపేద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.