రాష్ట్రం లో ప్రశ్నించే వారిని పోలీసు వ్యవస్థ తో వేధిస్తున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఆరోపించారు. శ్రీకాకుళంలో మాజీ సర్పంచ్ అవినాష్ పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేయడానికి పోలీసు వేధింపులే కారణమని అన్నారు. అవినాష్ ఘటనపై ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ మోసాలే అజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వెళుతుందని ఆయన అన్నారు. 50 శాతం జనాభా గా ఉన్న బీసీ ల రిజర్వేషన్ కోసం ఢిల్లీ లాయర్ ను ఎందుకు పెట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు.
previous post