27.7 C
Hyderabad
May 14, 2024 07: 56 AM
Slider నల్గొండ

స్మారక స్థూపాన్ని కూలగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం మల్లన్న నగర్ లో ఎఐఎస్ఎఫ్ నాయకురాలు అమరజీవి కోనేరు స్వరూప స్మారకార్ధం నిర్మించిన కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

శిధిలమైన స్థూపాన్ని సోమవారం పరిశీలించిన అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1976వ, సంవత్సరంలో కామ్రేడ్ కోనేరు స్వరూప స్మారకార్ధం స్థల దాతల సహకారంతో నిర్మించటం జరిగిందని, ప్రతి సంవత్సరం ఆమె జ్ఞాపకార్థం శ్రద్దాంజలి ఘటిస్తున్నామని, ఇట్టి చర్యకు పాల్పడిన వారిపై  చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తెల నారాయణ రెడ్డి,పాలకూరి బాబు,యల్లావుల రాములు,కొప్పోజు సూర్యనారాయణ, సీనియర్ నాయకుడు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కంబాల శ్రీనివాస్,పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,జడ శ్రీనివాస్,దేవరం మల్లీశ్వరి,జక్కుల రమేష్,ఇందిరాల వెంకటేశ్వర్లు,జి.వెంకన్న, సుందరి పద్మ,గుండా రమేష్, స్వామి, వాసుదేవరావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిల్లలకు చదువు చెప్పించేందుకు తంటాలుపడుతున్న గ్రామం…

Satyam NEWS

ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమం తిరుపతి నుంచే శ్రీకారం

Satyam NEWS

మోదీ పర్యటన: రేపు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినిపార్క్ మూసివేత                                                             

Satyam NEWS

Leave a Comment