ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సానికొమ్ము రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్వ లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ కే సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ములుగు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు సాయంత్రం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు జనరల్ సెక్రటరీ కొండి సాంబశివ మాట్లాడుతూ డాక్టర్ కె సుధాకర్ గత 50 సంవత్సరాల నుంచి కూడా లైన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ లైన్స్ క్లబ్ సభ్యులకు సూచనలు తోడ్పాటు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు చుంచు రమేష్, కోశాధికారి ముక్కు సుబ్బారెడ్డి, జె ఎల్ టీ కోఆర్డినేటర్ దొంతిరెడ్డి బలరాం రెడ్డి బండారి హరినాథ్ గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.