సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యవసాయ విస్తరణ అధికారిపై దుబ్బాక పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దురుసుగా ప్రవర్తించడమే కాదు లాఠీతో దారుణంగా కొట్టారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ అధికారి చెప్పేది వినిపించుకోలేదు.
ఓవర్ యాక్షన్ చేస్తు వ్యవసాయ విస్తరణ అధికారి చెప్పుతున్నా వినిపించుకోకుండా దాడి చేయటంతో సిద్దిపేట పోలీస్ కమీషనర్ కు ఏఈఓ ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ మన్నెస్వామి, ఇద్దరు కానిస్టేబుళ్ళను కమీషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సిపి జోయల్ డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు.